Tuesday, March 26, 2024

Breaking | విద్యుత్ టవర్ ఎక్కిన సైకో.. రెండు గంటల పాటు హంగామా

మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. సోమవారం రాత్రి పెద్దపెల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ తండా లోని రైల్వే ట్రాక్ సమీపంలో గల హై టెన్షన్ టవర్ పైకి మతిస్థిమితం లేని వ్యక్తి ఎక్కి ఇంగ్లీషులో మాట్లాడుతూ హంగామా చేశాడు. సమాచారం అందుకున్న సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, బసంత్ నగర్ ఎస్ఐ శ్రీనివాస్ లు సంఘటన స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు నచ్చజెబితే కిందికి దిగాడు. అయితే మతిస్థిమితం సరిగా లేకపోవడంతో పేరు, గ్రామం వివరాలు చెప్పలేకపోవడంతో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement