Thursday, May 2, 2024

AP: పేరుకే కూట‌మి.. అభ్య‌ర్ధులంతా టీడీపీ వాళ్లే.. చంద్ర‌బాబుపై స‌జ్జ‌ల ఫైర్

జ‌న‌సేన‌, బీజేపీని అంతం చేయ‌డ‌మే చంద్ర‌బాబు ల‌క్ష్యం
అధికారుల‌పై పెత్త‌నం కోసం ఆరాటం
త‌ప్పుడు ఫిర్యాదుల‌తో బాబు అండ్ కో
పెన్ష‌న్ మ‌ర‌ణాలకు బాబే కార‌ణం

తాడేప‌ల్లి – కూట‌మి త‌రుపున పోటీ చేసే అభ్యర్థులను చంద్రబాబే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమిలో జనసేన, బీజేపీకి అసలు ఉనికే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తాడేప‌ల్లిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…. ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన లేకుండా బాబు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారన్నారు. అధికారులను చంద్రబాబు కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అధికారులపై చంద్రబాబు అండ్ కో తప్పుడు ఫిర్యాదులు చేస్తోందన్నారు.

చంద్రబాబు పిల్ల చేష్టలు చేస్తున్నారని, సీఎం జ‌గ‌న్ ను నోటికొచ్చినట్లు తిడుతున్నారన్నారు స‌జ్జ‌ల‌. వ్యవస్థలపై చంద్రబాబుకు గౌరవమే లేదన్నారు. వృద్ధులకు టైమ్‌కి పెన్షన్లు అందకుండా చంద్రబాబు పాపానికి పాల్పడ్డారని తెలిపారు. వాలంటీర్లపై కక్షతోనే చంద్రబాబు అలా చేశారన్నారు. బాబు ఎన్ని కుట్రలు చేసినా 93 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామన్నారు. పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబుది రాక్షస మనస్తత్వం అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అనుకున్న వాళ్లకే టికెట్లు ఇచ్చుకున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement