Friday, July 26, 2024

కల్తీసారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన ర్యాలీ

అమరావతి, ఆంధ్రప్రభ : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన కల్తీసారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. సోమవారం అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నారా లోకేష్‌ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వ మోసం ఖరీదు 25 ప్రాణాలంటూ నినాదాలు చేశారు. మద్యపాన ని షేదం ఏమైందంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.

ఖాళీ మద్యం సీసాలతో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఏపీలో నాసిరకం మద్యం బ్రాండ్లు విక్రయిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. బాధితుల కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని టీడీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ నిరసన ర్యాలీలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీ, ఎమ్మెల్సీలు దీపక్‌ రెడ్డి, ఆశోక్‌ బాబు, బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement