Monday, April 29, 2024

AP : అన్ని పార్టీలు కలిసి జగన్ పై యుద్ధం.. మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి పై యుద్ధం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబుకు మద్దతు ఇస్తుందని.. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలనే షర్మిలమ్మ మాట్లాడుతుందని తెలిపారు.

చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలో నేడు జరిగిన డీసీసీబి బ్యాంకు ప్రారంభోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు.ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా ఉంది.. మిగిలిన మూడు సంవత్సరాల్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాంమని, ఏ ముఖ్యమంత్రి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రులు అది చేసే ఇది చేశామనే మాటల తప్ప పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు దాక తీసుకెళ్లారు.. జగన్ కొన్ని లక్షల ఇళ్లు కట్టించామని అన్నారు.
మత,కుల పిచ్చి పార్టీలతో టీడీపీ పొత్తు
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ, మత పిచ్చితో బీజేపీ, కుల పిచ్చితో జనసేన, కుట్రతో కాంగ్రెస్ చంద్రబాబుతో జతకట్టాయని దుయ్యబట్టారు. రేపు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బీజేపీ పవన్ లను అడగాల్సిందేనని ఆరోపించారు. గత ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన అందరూ జగన్ వల్లే గెలిచారు.. ఈ ఎన్నికల్లో సుమారు వంద సీట్ల గెలుపు భాద్యతలను పెద్దిరెడ్డికి జగన్ అప్పజెప్పారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement