Friday, May 17, 2024

Big Breaking: ఆటోను ఢీకొట్టిన లారీ.. ఆరుగురు మృతి

ఆటోను లారీ ఢీకొట్ట‌డంతో ఆరుగురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలోని కొమ‌రాడ ద‌గ్గ‌ర ఆటోను లారీ ఢీకొట్టింది.ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే ఆరుగురు మృతిచెంద‌గా, మ‌రొక‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పెళ్లి వేడుక‌కు వెళ్లి ఆటోలో తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement