Friday, April 26, 2024

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి



అనంతపురం జిల్లా పామిడి సమీపంలోని డాబా వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను మరో వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదంలో ఐదు మంది మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. చికిత్సకోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ కూలీలు. కొప్పలకొండ కు పత్తి పీకడానికి పని కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement