Friday, May 3, 2024

Visakha | చదువుకోడం లేదని మందలిస్తే.. శ్రీచైతన్య నుంచి పరారైన ముగ్గురు స్టూడెంట్స్​

విశాఖపట్నం గాజువాకలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో 12వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు (జూన్ 24 శనివారం) నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారు కాలేజీ నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. వీరిలో పిల్లా దిలీప్, యు. దంతేశ్వర్ (బాబీ), గండ్రెడ్డి ఉమేష్ పవన్ ఉన్నట్టు సమాచారం. ఇక.. ఈ ముగ్గురు యువకులు చదువుపై ఫోకస్​ చేయకపోవడంతో వారి తల్లిదండ్రులు మందలించారని, ఈ క్రమంలో వారితో వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముగ్గురు యువకులు కాలేజీకి వెళ్లకుండా గాజువాక నుండి దిలీప్ స్వగ్రామమైన అనకాపల్లిలోని కె కోటపాడుకు వెళ్లారు. సాయంత్రం అయినా వారు ఇంటికి రాలేదని సమాచారం. గాజువాక నుంచి విద్యార్థులు బయలుదేరుతుండగా సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యిందని పోలీసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కె.కోటపాడు నుంచి వీరు కనిపించకుండా పోయారు. మధ్యాహ్నం భోజనం చేసి వెళ్లిపోయారు కానీ, ఆ తర్వాత ఇంటికి రాలేదు. వారిద్దరి వద్ద మొబైల్ ఫోన్లు లేవు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement