Sunday, April 28, 2024

Breaking: ప్రకాశంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జె.పంగులూరు మండలం రేణంగివరం వద్ద జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు గుంటూరు జిల్లా చిలకలూరిపేట వాసులుగా గుర్తించారు. తెల్లవారుజామున మంచు ఎక్కువగా ఉండటం, జాతీయ రహదారి కావడతో వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడం ఈ ప్రమాదం జరిగింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement