Tuesday, April 30, 2024

కాణిపాకం ఆలయంలో 15 రోజుల హుండీ ఆదాయం రూ. కోటి

కాణిపాకం, జూన్ 30 (ప్రభ న్యూస్) : ప్రముఖ సత్య ప్రమాణాల క్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానానికి హుండీ ద్వారా 15 రోజులకు రూ కోటి. 7లక్షల ఆదాయం లభించింది. అందులో బంగారం 92.గ్రాములు
వెండి 1 కిలోల 200.గ్రాములు ఉన్నాయి. స్వదేశీ నగదు కాక 732 యు ఎస్. డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్లు, 51 మలేషియన్ రింగెట్లు, 20 సింగపూర్ డాలర్లు, 1,065 యూఏఈ దినారమ్స్ ఉన్నాయని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వెంకటేశు తెలిపారు.

మొత్తం గత 15 రోజుల్లో హుండీ ద్వారా రూ. 1,07,28,040 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఏఈఓలు ఎస్.వి.కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హేమమాలిని, హరి మాధవరెడ్డి, పర్యవేక్షకులు రవి, రంగస్వామి, దేవస్థానం సిబ్బంది, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement