Friday, May 17, 2024

దొండ‌ప‌ర్తిలో 102అడుగుల భారీ గ‌ణేశ్-102కిలోల ల‌డ్డు

దేశ‌మంత‌టా వినాయ‌క‌చ‌వితి సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. వాడ వాడ‌లా గ‌ణ‌ప‌తి మండ‌పాలు వెలిశాయి. విఘ్నేశ్వరుడిని భక్తి ప్రపత్తులతో పూజిస్తున్నారు. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్లా వైజాగ్ లోని దొండపర్తి వినాయక విగ్రహం అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు తెచ్చుకుంది. దొండపర్తిలో వైఎస్ జగన్ యువసేన 102 అడుగుల భారీ గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం మొత్తం మట్టితోనే తయారుచేయడం విశేషం. ఈ విగ్రహంతో పాటు 102 కిలోల లడ్డు కూడా ఉంచారు. దొండపర్తి వినాయకుడ్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తుండడంతో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కాగా, ఈ విగ్రహాన్ని 21 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement