Saturday, May 18, 2024

విశాఖలో కేటీఆర్ కు పాలాభిషేకం

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.అయితే రోజు రోజుకి కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా కార్మికులకు మద్దతుగా నిలిచాయి. ఇక బుధవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, కెసిఆర్ కుమారుడు కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతు తెలిపారు. వీలైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొంటామని కూడా చెప్పుకొచ్చారు. దీంతో కేటీఆర్ ప్రకటనపై విశాఖలో కార్మికులు జేజేలు కొట్టారు. కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలుగువారి ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement