Friday, May 3, 2024

ఏపీ అభివృద్ధిని చూసి దేశం గర్విస్తోంది – సజ్జల

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరోఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశం మొత్తం గర్వి గర్విస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సభలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రోడ్లను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఎన్నికల జరుగుతున్న దృశ్య రోడ్లు గురించి మాట్లాడం విచిత్రంగా ఉంది అని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల వ్యాఖ్యలు చేశారు.

అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో అక్కడ ఉన్న తెలంగాణ ప్రజల కి తెలుసన్నారు. ఏపీలో అభివృద్ధి చూసి దేశం మొత్తం గర్విస్తుంది అని కేసీఆర్ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడుకు అర్ధరాత్రి వరకు రోడ్లు మీద ఉండి బ్రహ్మ రథం పట్టారని కొంతమంది వ్యాఖ్యలు చేయటం హాస్యంగా ఉందన్నారు. ట్రాఫిక్ జాం ప్రాంతంలో చంద్రబాబు కాన్వాయ్ పెట్టి ప్రజలు భారీగా తరలివచ్చారని చెప్పటం సిగ్గుచేటున్నారు.హైదరాబాదులో చంద్రబాబు అని చూసేందుకు వచ్చింది పచ్చ బ్యాచ్ మాత్రమేనని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement