Friday, May 3, 2024

HYD : నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసింది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డినే

నాగోల్, నవంబర్ 11(ప్రభ న్యూస్)
శనివారం ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నాగోల్ డివిజన్ పరిధిలోని విశాలాంధ్ర కాలనీ, రాఘవేంద్రకాలనీ,లేక్ వ్యూ అపార్ట్మెంట్,శైలజపురి కాలనీ,అవెన్యూ హోమ్స్ మరియు జైపూరి కాలనీ,సాయి నారాయణ కాలనీ(భాగ్య ఎంక్లేవ్) నందు కాలనీవాసుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.అనంతరం జైపూరి కాలనీ నందు బారస పార్టీ కార్యాలయం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు ముక్తకంఠంతో మాట్లాడుతూ నియోజకవర్గన్నీ అభివృద్ధి చేసిన ఘనత సుదీర్ రెడ్డి దే అని కొనియాడారు.మా ఓటు మీకే భారాస ఎమ్మెల్యే కే అని తెలిపారు.కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మీరు విజయం సాదించక అప్పుడు మిమ్మల్ని అడుగుతాము అని తెలిపారు. ఇతర పార్టీల వారి యొక్క మాటలు మేము నమ్మము అని ముక్తకంఠంతో పలికారు. మరింత అభివృద్ధి కావాలంటే మీతో సాధ్యం అని పేర్కొన్నారు. మేమే మా కాలనీ నందు మీ కోసం ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు.కారు గుర్తుకే మా ఓటు అని తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయం నందు ఇతర పార్టీల నుంచి బారస పార్టీలోకి భారీగా సుదీర్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞత తెలియజేశారు.మళ్లీ నన్ను ఎమ్మెల్యే గా ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రం లోనే ఎల్బీనగర్ ను నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హమీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్,ఆనంతుల రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్,ప్రమీల,శిల్ప,మైసయ్య,సీతారాముల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement