Saturday, July 27, 2024

TS : స్వ‌దేశానికి చంద్ర‌బాబు.. ఎయిర్‌పోర్టు ఘ‌న‌స్వాగ‌తం

పది రోజుల పాటు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీడీపీ ఛీఫ్ చంద్ర‌బాబు తిరిగి ఇవాళ ఉద‌యం స్వ‌దేశానికి చేరుకున్నారు. ఆయ‌నకు పార్టీ నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయన సతీమణి భువనేశ్వరి విదేశీ పర్యటన ముగించుకుని హైద‌రాబాద్‌కు చేరుకున్నారు.

- Advertisement -

ఏపీలో ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యవహారాలతో బిజీగా గడిపిన చంద్రబాబు.. విశ్రాంతి కోసం ఈనెల 19వ తేదీన విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.

మరోవైపు చంద్రబాబు మాత్రమే కాకుండా చాలా మంది నేతలు పోలింగ్ పూర్తైన మరుసటి రోజే విదేశాలకు వెళ్లారు. ఇక కౌటింగ్ సమయం దగ్గర పడుతుడంటంతో వీదేశీ పర్యటనలో ఉన్న నేతలు స్వదేశానికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement