Tuesday, April 30, 2024

Breaking: అంతా తూచ్… మేం పోటీ చేయట్లే.. షర్మిల

తెలంగాణలో మేం పోటీ చేయట్లేదని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. లోటస్ పాండ్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో తాము పోటీ చేయడం వల్ల బీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందని, కాంగ్రెస్ కు నష్టం చేకూరుతుందని.. అందువల్ల తెలంగాణలో తాము పోటీ చేయడం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ చీలకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. వ్యతిరేక ఓటు చీలితే తిరిగి కేసీఆర్ సీఎం అవుతారన్నారు. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ చీలకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత కొన్ని రోజుల ముందు రాష్ట్రంలోని 119నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్న ఆమె.. మేము పోటీ చేయట్లేదు.. కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో షర్మిల చేతులెత్తేశారు. ఆయుధ సామాగ్రి లేదని …యుద్దం చేయలేనని ప్రకటించారు. ప్రజల కోసమంటూ-కలరింగ్ ఇచ్చారు. సెంటీమెంట్ డైలాగ్ లతో షర్మిల రక్తి కట్టించారు. శ్రీనివాసరెడ్డి తనకు అన్న లాంటి వాడని.. ఆయన కోసం పాలేరు నుండి నిష్కమ్రణ అంటూ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement