Friday, May 10, 2024

Maharashtra : బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి తెలంగాణకు నీటి విడుదల

మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి శుక్రవారం ఉదయం దిగువ గోదావరిలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ డీఈ గణేష్ తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ఏడు కూడా తాగునీటి అవసరాల కోసం బాబ్లీ దిగువనున్న ఎస్సారెస్పీలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. అదేవిధంగా జులై ఒకటవ తేదీన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు అక్టోబర్ 28 తేదీ వరకు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు.

బాబ్లీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 2.75 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 0.75 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. ఆందులో నుంచి దిగువకు 0.6 టీఎంసీలను విడుదల చేశారన్నారు. 0.6 టీఎంసీల నీరు దిగువ గోదావరిలోకి విడుదల కాగానే బాబ్లీ గేట్ల మూసివేత ప్రక్రియను ప్రారంభిస్తారమన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి హైదరాబాద్ ఈఈ వెంకటేశ్వర్లు, నాందేడ్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీఆర్ బాన్సద్, ఎస్సారెస్పీ డీఈలు గణేష్, ప్రశాంత్, ఏఈఈలు రవి, ప్రణీత్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement