Friday, May 17, 2024

Warangal-Narsampet : ప్రధాన రహదారి రోడ్డు ప్రమాదం.. గ్రామస్తుల నిరసన..

గీసుగొండ, జూన్ 23 (ప్రభ న్యూస్) : సైకిల్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని కాలేజ్ బస్ ఢీకొట్టగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి.. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ వైపు నుంచి వెళ్తున్న ఓ ప్రైవేట్ కళాశాల బస్సు గీసుగొండ మండలం మచ్ఛాపూర్ హర్జ్య తండా వద్ద సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు కళాశాల బస్సులను నిలిపివేశారు. దీంతో గంటపాటు వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ రోడ్డుపై తరచూ ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని, పట్టించుకునే వారే లేరని వాపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement