Tuesday, May 7, 2024

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య.. మూడు రోజుల త‌ర్వాత మృత‌దేహం

ఆర్థిక ఇబ్బందుల‌తో బాధావ‌తు భ‌ద్రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల ధర్మ తండా గ్రామ పరిధిలోని హట్యా తండాకు చెందిన వ్య‌క్తి.ఆయ‌న వ‌య‌సు 28సంవత్సరాలు.. కాగా ఆయ‌న మృతదేహం ఎల్లాయిగూడెం గ్రామ సమీపంలోని గుట్టల్లో ఆదివారం కనిపించింది.తండా వాసుల కథనం ప్రకారం బాధావతు భద్రు రోజువారీ కూలీ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నాడు.ఇటీవలే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువడంతో ఏప్రిల్ 27 న పురుగుల మందు తాగాడు.ఆరోజు నుండి భద్రు ఫోన్ స్విచ్చాఫ్ లో ఉంది.కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.కాగా ఆదివారం పొలం దగ్గరకు వెళ్తున్న రైతులకు దుర్వాసన రావడంతో దగ్గరికెళ్లి చూడగా డెడ్ బాడీ కనిపించింది.చుట్టుపక్కల వాళ్ళు అందించిన సమాచారంతో తండవాసులు చూసి భద్రు మృతదేహాంగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం నర్సంపేటకు తరలించారు.మృతుడు భద్రుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement