Friday, May 17, 2024

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి..

మల్హర్, ఏప్రిల్ 5 (ప్రభన్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన మూడెత్తుల లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తన భర్త రమేష్ బుధవారం ఉదయం భార్య లక్ష్మి ని గొంతు నులిపి చంపినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అనుమానంతో భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుసగుసలు వినవస్తున్నాయి. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న కాటారం సిఐ రంజిత్ రావు , ఎస్సై నరేష్ సంఘటనకి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహాదేవపూర్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

\

Advertisement

తాజా వార్తలు

Advertisement