Thursday, May 9, 2024

భూమి ప‌ట్టాలు ఇవ్వాలి.. వాట‌ర్ ట్యాంక్ ఎక్కి రైతుల నిర‌స‌న‌..

మహబూబాబాద్ : త‌మ భూమి ప‌ట్టాలు ఇప్పించాల‌ని రైతులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఇందులో భాగంగా వాట‌ర్ ట్యాంక్ ఎక్కి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. మ‌హబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన రైతులు తమకు పట్టాలు ఇవ్వడం లేదని శుక్రవారం కేసముద్రం తహసీల్దార్ కార్యాలయంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియ‌జేశారు. ఎన్ని రోజులు ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిరిగినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని అందుకే ఆందోళ‌న బాట ప‌ట్టిన‌ట్లు రైతులు తెలిపారు. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి త‌మ‌కు న్యాయంగా రావాల్సిన ప‌ట్టాల‌ను త‌మ‌కు అందించాల‌ని కోరారు. లేకుంటే ఆందోళ‌న‌లు మ‌రింత ఉదృతం చేస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement