Saturday, March 23, 2024

కళ్యాణ లక్ష్మి పేద‌ల‌కు వ‌రం : ఎమ్మెల్యే అరూరి ర‌మేష్‌

క‌ళ్యాణ ల‌క్ష్మి పేద‌ల‌కు వ‌రం అని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ అన్నారు. కాజీపేట మండలానికి చెందిన 65మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 65లక్షల 07వేల 540 రూపాయల విలువ గల చెక్కులను, అలాగే 25మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 7లక్షా 77వేల 500రూపాయల చెక్కులను మొత్తం 72లక్షల 85వేల 040రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేష్ పంపిణీ చేశారు. మడికొండలోని రాజరాజేశ్వరి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.

పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్ రావు, ఆవాల రాధిక రెడ్డి, మునిగాల సరోజన, దర్గా సొసైటీ చైర్మన్ ఊకంటి వనం రెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు కంకణాల సంపత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బస్కె శ్రీలేఖ, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement