Monday, April 29, 2024

Khanapuram: ఇన్విజిలేటర్ దాడే ఆత్మహత్యకు కారణమా…?

వరంగల్ జిల్లా ఖానాపూరం మండలం రాగంపేట గ్రామానికి చెందిన భూక్యా సాయికుమార్ అనే యువకుడు నిన్న చింతలపల్లీ రైల్వే గేట్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అయితే ఆ యువకుడు మృతి చెందడానికి ప్రధాన కారణం నర్సంపేట పట్టణ కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాల పరీక్ష కేంద్రంలో జరిగిన దాడే అని యువకుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న యువకుడు డిగ్రీ పరీక్షలు రాసేందుకు వెళ్లగా.. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ అవమానించి ఒకింత దాడి చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనను తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని యువకుని మృతదేహంతో బాలాజీ మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఎదుట కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. కాలేజ్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement