Thursday, July 25, 2024

మోసపోయాను.. నేను ఖ‌ర్చు పెట్టిన డ‌బ్బులు ఇప్పించండి : చేవెళ్ల స్వామి

జనగామ : వైఎస్ఆర్‌టిపి జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవి ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని ఇంటి ఎదుట వైఎస్ఆర్ టిపి కార్యకర్త బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టిపి కార్యకర్త చేవెళ్ల స్వామి మాట్లాడుతూ బచ్చన్నపేట మండలం ఇటుకలపల్లి గ్రామానికి చెందిన నాకు వైఎస్ఆర్‌ టిపి జనగామ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఇందుర్తి వెంకటరెడ్డి వైఎస్ఆర్‌టిపి జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఇప్పిస్తానని చెప్పి నా చేతులతో సంవత్సరం నుండి ఖర్చులు పెట్టించడమే కాకుండా షర్మిల పాదయాత్రకు సైతం ఖర్చులు పెట్టించడం జరిగిందని, అయినా కూడా ఏ పదవి ఇప్పించకపోగా తాను నియోజకవర్గ కోఆర్డినేటర్ గా తెచ్చుకున్నాడని అన్నారు. తన వ్యవసాయ భూమి రెండు ఎకరాలు అమ్మి 50 లక్షలు ఖర్చు చేశానని, ఆ డబ్బులు ఇవ్వాలని, ఏ పదవి నాకు వద్దు, ఖ‌ర్చు చేసిన డబ్బులు ఇస్తే చాలని ఇందుర్తి వెంకటరెడ్డి ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement