Saturday, May 4, 2024

WGL: గిరిజనులను వర్గీకరణ చేస్తే సహించేది లేదు… రమేష్ నాయక్

జనగామ, ఆగస్టు 19, ప్రభ న్యూస్ : గిరిజనులను వర్గీకరణ చేస్తే సహించేది లేదని సేవాలాల్ సేన అధ్యక్షులు రమేష్ నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గిరిజనులను వర్గీకరిస్తామని అనడం గిరిజనులను అవమానపరిచినట్టేనని అందుకు నిరసనగా శనివారం జనగామ జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో స్థానిక పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా రమేష్ నాయక్ మాట్లాడుతూ… గిరిజనులను కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తే సహించేది లేదని, అవసరమైతే గాంధీభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గిరిజనులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను విరమించుకొని గిరిజనులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement