Wednesday, May 1, 2024

Breaking | ఆగి ఉన్న డీసీఎంని ఢీకొట్టిన ఆటో.. అయిదుగురికి స్వ‌ల్ప గాయాలు!

మహబూబాబాద్ జిల్లాలో ఇవ్వాల (ఆదివారం) రాత్రి యాక్సిడెంట్ జ‌రిగింది. ఆగి ఉన్న డీసీఎంని ఆటో ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అయితే.. ప్ర‌మాదంలో అయిదుగురు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఆగి ఉన్న డీసీఎంని ఆటో ఢీకొట్టిన‌ట్టు స్థానికులు తెలిపారు. ఇందులో భూక్య రాములు అనే వ్య‌క్తికి తీవ్ర గాయలయ్యాయి.

బాధితులంతా గుంజేడు ముసలమ్మని దర్శనం చేసుకుని తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. బాధితులంతా కేసముద్రం మండలం కోరుకొండపల్లి శివారు తండాకు చెందినవారు. గాయపడిన వారిని 108 ద్వారా గూడూరు ఆస్ప‌త్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement