Monday, April 29, 2024

Visit – మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు బయలుదేరిన రాహూల్ గాంధీ

హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బయలుదేరారు..మేడిగడ్డ బ్యారేజీ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. కాగా.. నిన్నరాహుల్‌గాంధీ కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో కట్టిన ప్రాజెక్టులతో లక్షల ఎకరాలకు నీరు పారుతుంటే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల భారీ వ్యయంతో కట్టిన ప్రాజెక్టులు ఒక్కోటి కూలిపోతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో బ్యారేజీ కూలిపోతోందని, సీఎం కేసీఆర్‌ వెళ్లి పరిశీలించాలని, అక్కడే సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement