Friday, May 17, 2024

గట్టు దంపతులది ప్రభుత్వ హత్యే – పిసిసి చీఫ్ ఉత్తమ్

పెద్ద‌ప‌ల్లి – రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది దంపతులది ప్రభుత్వ హత్యే అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దపెల్లి జిల్లా గుంజపడుగు లో వామన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, పోలీసులు టిఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లుగా మారిపోయారన్నారు. కేసు ను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు చేస్తే అసలు దోషులు బయట పడతారన్నారు. వామన్ రావు కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్యలతో పాటు పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement