Monday, April 29, 2024

Kishan Reddy: సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన…. స్టేషన్ అభివృద్ది పనుల పర్యవేక్షణ…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ సికింద్రాబాద్ లో పర్యటించనున్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను పర్యవేక్షించునున్నారు. కాగా..కేంద్ర ప్రభుత్వం రూ.715 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఈ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు దక్షిణ మధ్య రైల్వే జీఎం, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు దశల్లో స్టేషన్‌ నిర్మాణ పనులు చేపట్టగా, మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ అనిల్ కుమార్ జైన్ ఇతర సీనియర్ అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షిస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement