Saturday, May 4, 2024

Monkey:కాదేది తినేందుకు అన‌ర్హం.. కోతుల కూర వండిన ట్రైబ‌ల్స్

కోళ్లు, మేకలు, చేప‌లు వండుకుని తిన‌డం సాధారణ విష‌యం అయితే కొందరు కోతులను చంపి తిన్నారంటే వీరు మనషులా.. లేక నరరూప రాక్షసులా అనే ఆలోచన వస్తుంది. ఈ అమానవీయ ఘటన నిర్మల్ జిల్లా బైంసా మండలం చింతలో బోరి గ్రామంలో చోటుచేసుకుంది.

చింత‌లో బోరి గ్రామంలో కొంద‌రు అడవిలో నాలుగు కోతులను పట్టుకుని వాటిని చంపి వండుకుని తిన్నారు. గమనించిన గ్రామస్తులు కోతులను చంపిన వారిని పట్టుకున్నారు. కోతులను చంపి తినేస్తున్నారని ఆరోపించారు. దేవుళ్లుగా పూజించే కోతులను ఎందుకు చంపారు? అంటూ గ్రామ‌స్తులు అడ్డం తిరిగారు. కోతులు తిన్న‌వారికి దేహ‌శుద్ది చేసి పోలీసుల‌కు అప్ప‌గించారు.. ఈరోజు కోతులు తింటే రేపు మనషులను తినేంత దుస్థితికి దిగజారుతురంటూ వీరిని వెంటనే పట్టుకుని శిక్షించాలని గ్రామ‌స్థులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement