Sunday, April 28, 2024

TS | ద్విచ‌క్ర వాహ‌నం అదుపు తప్పి వ్యక్తి మృతి.. మెదక్​ జిల్లాలో ఘటన

కౌడిపల్లి (ప్రభ న్యూస్): ద్విచ‌క్ర వాహ‌నం అదుపుతప్పి వ్యక్తి చ‌నిపోయిన‌ ఘటన మెద‌క్ జిల్లాలో జ‌రిగింది. కౌడిప‌ల్లి మండల పరిధిలోని రైలాపూర్ గేటు సమీపాన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాయి పెంటయ్య (45) వెంకట్రావుపేట వద్ద కూరగాయలు తీసుకొని తిమ్మాపూర్ వస్తుండగా రైలాపూర్ గేటు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. ఎదురుగా ఉన్న ఆటోను ఢీకొట్టింది. దీంతో పెంటయ్య తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే హాస్పిటల్ తరలిస్తుండగా ఆయన చనిపోయాడు. ఈ విషయమై కౌడిపల్లి పోలీసులను సంప్రదించగా సమాచారం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement