వికారాబాద్ (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా సర్పంచ్ పల్లి ప్రాజెక్టు సమీపంలో ఇవ్వాల (శనివారం) రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటన సాయంత్రం 6 .45 గంటలకు జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా రెండు బైకులు రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, అంతారం గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి అక్కడికి అక్కడే చనిపోయాడు. సర్పంన్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డికి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-09-at-7.31.12-PM-473x1024.webp)