Friday, May 3, 2024

TS | గంజాయి తరలిస్తున్నఇద్దరి అరెస్ట్.. ఎండుగంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను భూపాల‌ప‌ల్లి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 7.44 కిలోల ఎండు గంజాయిని, రెండు సెల్ ఫోన్లను స్వాధీన పర్చుకున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలిచ్చిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో తమ పోలీసులు తనిఖీలు నిర్వహించామన్నారు. స్థానిక సుభాష్ కాలనీకి చెందిన కంది సాయిచరణ్ 23, భాస్కర్ గడ్డకు చెందిన మందల కళ్యాణ్ కుమార్ 22 వద్ద 7.467.44 కిలోల ఎండు గంజాయి లభ్యమైనట్లు తెలిపారు.

నిందితుల‌ను అరెస్టు చేసి, వారి వద్ద గల గంజాయిని, రెండు సెల్ ఫోన్లను స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. ఎండు గంజాయిని వీరిద్దరు నిందితులు సుభాష్ కాలనీకి చెందిన తోట పవన్ వద్ద కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని చెప్పారు. ప్రస్తుతం తోట పవన్ పరారీలో ఉన్నాడని, అరెస్టయిన ఇద్దరు నిందితులను రిమాండుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ.1.86లక్షలు ఉంటుందని వివరించారు. ఈ సమావేశం లో డీఎఎస్పీ రాములు, సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సైలు శ్రావణ్ కుమార్, సంధ్యారాణి, స్వప్నకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement