Sunday, April 28, 2024

TS – విద్య‌పై చేసేది ఖ‌ర్చుకాదు … పెట్టుబ‌డి – రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ స్పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బంజారా హిల్స్ లోనిర్మించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను నేడు ఆయ‌న ప్రారంభించారు.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారన్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారని అన్నారు.

గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు విడి విడిగా ఉండేవని, దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించామన్నారు . ప్రతీ నియోజకవర్గంలో ఒకే క్యాంపస్ లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి కులాల మధ్య అంతరాలు చేరిపేయాలనుకుంటున్నామని, పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో శంకుస్థాపన చేసామన్నారు.

అంతేకాకుండా..’చదువుమీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి అని అన్నారు. చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అంటూ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి లాంటి వారికి చదువుతోనే గుర్తింపు, గౌరవం వచ్చాయ‌న్నారు.. లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ బిల్లుకు ఆమోదించింది జగ్జీవన్ రామ్ కూతురు మీరాకుమారి అని, తెలంగాణ రాష్ట్రమంతా ఆమెను ఎప్పుడూ గుర్తు చేసుకుంటుందని అన్నారు.


కాలం ఎప్పుడూ ఒకేలా ఉండద‌ని, .. ఒకసారి దొరల చేతిలో ఉంటే.. ఒకసారి దళితుల చేతుల్లో ఉంటుంద‌ని అన్నారు. . దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇవాళ అసెంబ్లీలో స్పీక‌ర్ స్థానంలో ఉన్న‌ గడ్డం ప్రసాద్ ని అధ్యక్షా అని పిలవాల్సిందేన‌ని అన్నారు. కొందరు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నార‌ని, … అసలు ఆ ప్రశ్నించే హక్కును, అధికారాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీనేన‌ని అన్నారు రేవంత్ .

Advertisement

తాజా వార్తలు

Advertisement