Saturday, May 4, 2024

TS | చికిత్స పొందుతూ పంచాయతీ కార్యదర్శి మృతి…

గణపురం,(ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యా యత్నం చేసింది.. కర్కపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రావణి ఆదివారం ఉరివేసుకుని దారుణానికి యత్నించింది. అయితే ఆమెను వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇవ్వాల (సోమవారం) రాత్రి మృతి చెందింది.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి వాడిన మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో పోలీసుల విచారణలో కొంత జాప్యం జరుగుతోంది. ఆదివారం ఉదయం ఆమె ఎవరితో ఫోన్‌లో మాట్లాడింది అనే కోణంలో విచారణ కొనసాగనుంది. ఇప్పటి వరకు శ్రావణి మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతురాలికి ఒక పాప, బాబు ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ ముమ్మరం చేసినట్లు ఎస్‌ఐ మచ్చా సాంబమూర్తి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement