Tuesday, April 30, 2024

TS – బి ఆర్ ఎస్ పార్టీ చలో మేదిగడ్డ

చలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా ఇవాళ తెలంగాణ భవన్‌ నుంచి బీఆర్ఎస్ బృందం మేడిగడ్డకు పయనం కానుంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గులాబీ పార్టీ ఈ పర్యటన చేపట్టింది. మొదట మేడిగడ్డలో పర్యటించి అనంతరం అన్నారం బ్యారేజీని సందర్శించనున్నారు. ఆ తర్వాత అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు.

అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కేసీఆర్‌ మినహా మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు మేడిగడ్డ సందర్శించే అవకాశం ఉంది. వీరితో పాటు పలువురు నీటిపారుదల శాఖ నిపుణులు కూడా వెంట వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement