Saturday, April 27, 2024

TS – మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి – భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ను కోరిన ఉప ముఖ్యమంత్రి భట్టి

మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి

తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి. అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారం ప్రభుత్వ పక్షాన అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

గురువారం సచివాలయంలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీ సీఎండి శంతను రాయ్ బృందంతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. BEML కంపెనీ బేస్ ఎక్కడ, ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు, ఉత్పత్తులు సృష్టిస్తుందో అడిగి తెలుసుకున్నారు.

మెట్రో రైల్ కోచ్ లు, రక్షణ, మైన్స్ వంటి రంగాల్లో తమ కంపెనీ పని చేస్తుందని సీఎండీ శంతను రాయ్ డిప్యూటీ సీఎం వివరించారు. బెంగళూరు కేంద్రంగా తమ కంపెనీ పని చేస్తుందని, రక్షణ రంగానికి సంబంధించి కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్‌లో, సింగరేణిలో ఎర్త్ మూవర్స్ రంగాల్లో పనిచేస్తున్నట్టు వివరించారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయం ఉన్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు BEML ,CMD తెలిపారు.

మెట్రో కోచ్ ఫ్యాక్టరీల తయారీలో ఇతర కంపెనీలకు BEMLకు ఉన్న తేడా ఏంటి? ధరలు, నాణ్యత వంటి అంశాల్లో మీకు ఉన్న ప్రత్యేకత ఏంటో కంపెనీ లెటర్ పై వివరించాలని తెలిపారు.సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా beml కంపెనీ మెట్రో కోచ్ నమూనాను కంపెనీ సీఎండి శంతను రాయ్ బృందం డిప్యూటీ సీఎంకు అందజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement