Friday, May 3, 2024

TS – అగ్ని ప్ర‌మాద బాధితులకు బండి ప‌రామ‌ర్శ‌…

క‌రీంన‌గ‌ర్ – అగ్ని ప్రమాదంలో గుడిసెల దగ్దమై సర్వస్వం కోల్పోయిన వడ్డెర బాధిత కుటుంబాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుక్ర‌వారం పరామర్శించారు. దగ్దమైన గుడిసెలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు సంజయ్ వద్దకు వచ్చి తాము సర్వస్వం కోల్పోయామని వాపోయారు.

కష్టపడి దాచుకున్న బంగారంతోపాటు ఉపాధి కల్పిస్తున్న యంత్రాలను, వాహనాలు సైతం అగ్ని ప్రమాదంలో దగ్దమయ్యాయని వాపోయారు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో తమకు తాత్కాలిక బసను కల్పించడంతోపాటు భోజన వసతిని మీరే(బండి సంజయ్) కల్పించారని, నిత్యావసర వస్తువులు, వంట సామ‌గ్రి అందించారని పేర్కొన్న బాధితులు మీకు రుణపడి ఉంటామని బండి సంజయ్ కు చేతులెత్తి నమస్కరించారు. కోల్పోయిన గుడిసెలను మళ్లీ వేసుకోవాలనుకుంటున్నామని, ఆదుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement