Wednesday, May 1, 2024

TS: సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన మాజీ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కలిశారు. ఇవాళ‌ తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. నరసింహన్ మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేశారు.

తెలంగాణ ఉద్యమం కీలకదశలో ఉన్న సమయంలో ఆయన ఉమ్మడి ఏపీకి గవర్నర్‌గా వచ్చారు. 2009 నుంచి రాష్ట్రం విడిపోయే వరకు గవర్నర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు తెలంగాణకు గవర్నర్‌గా పని చేశారు. నరసింహన్ తర్వాత తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్‌గా వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement