Monday, April 29, 2024

TS : మోదీ బడే భాయ్‌.. రేవంత్ చోటే భాయ్‌…. కేటీఆర్

మేడ్చల్ ప్ర‌తినిధి, ఏప్రిల్ 24(ప్ర‌భ‌న్యూస్‌): మోదీ బడే భాయ్… రేవంత్ చోటే భాయ్ అంటూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దెవా చేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇవాళ ఆయ‌న మ‌ల్కాజ్‌గిరి లోక్‌స‌భ అభ్య‌ర్థి రాగిడి ల‌క్ష్మారెడ్డికి మ‌ద్ద‌తుగా దొంగ‌ల‌మైస‌మ్మ‌లో ప్ర‌చారం నిర్వ‌హించారు.

- Advertisement -

మోదీ, రేవంత్‌లు ఇద్దరు పెద్ద మోసగాళ్ల‌ని ఎన్నికల వాగ్దానాలను అమలు చేయటంలో ఘోరంగా విఫలమయ్యారని మండిప‌డ్డారు. ఇక్కడ బిజెపి నుంచి పోటీ చేస్తున్న ఈటెలను, అలాగే కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న సునీతారెడ్డిలు వలస పక్షులతో పోల్చారు. బీజేపీ, కాంగ్రెస్‌కు మళ్ళీ ఓటు వేసి మోసపోవద్దని హిత‌వు ప‌లికారు. వారికి డిపాజిట్ రాకుండా ఓడించాలని కోరారు. స్థానికంగా అందుబాటులో ఉండే రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి గెలిపించాలన్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్​కి 10 నుంచి 12 సీట్లలో గెలిపించి, దేశంలో కీలక భూమిక కు పోషించేలా, రాజకీయాలను శాషించేలా అవకాశం కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చామకురా మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మేల్యేలు కూన వివేకానంద, బండారు. లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, దేవినేని సుధీర్ రెడ్డి, దయానంద్ గుప్త, ఎమ్మెల్సీలు సురభి వాణి, శీంభీపూర్ రాజు స్థానిక నాయకులు డి.సి.ఎం.ఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మద్ధుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, జహంగీర్, సోమశేఖర్ రెడ్డి, నందికంటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement