రేపు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను టీఆర్ఎస్ ఎంపీలు కలవనున్నారు. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కలవనున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రేపు ఢిల్లీ కి వచ్చిన తర్వాత, తెలంగాణ నేతల బృందం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీకి చేరుకున్న మంత్రుల బృందంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో సహా, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉండగా నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చిన లోకసభ టీఆర్ఎస్ నాయకులు నామా నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఉన్నారు. మరోసారి కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్ ను కలిసి ఖరీప్ సీజన్ లో పండే వరిధాన్యం కొనుగోలుపై తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం స్పష్టత కోరనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital