Friday, April 26, 2024

గోషామ‌హ‌ల్ లో బిపిన్ రావ‌త్ కు నివాళులు

ఆర్మీ హెలికాప్టర్ నిన్న త‌మిళ‌నాడు రాష్ట్రంలో కుప్ప‌కూలి సీడీఎస్ చీఫ్‌ బిపిన్ రావత్ దంపతులతో సహా మొత్తం ఈ ప్ర‌మాదంలో 13 మంది చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ న‌గ‌రంలోని గోషామ‌హ‌ల్ లో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో భాజపా రాష్ట్ర కార్యాలయ కార్యక్రమ ఇన్ ఛార్జ్ డీ.గోపాల్‌, డీ.సీ.శేఖర్, సుధాకర్ రెడ్డి, విజయ్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement