Wednesday, May 1, 2024

Breaking | 25 మంది డీఎస్పీల బదిలీ.. ఆదేశాలు జారీ చేసిన డీజీపీ అంజనీకుమార్​

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 25 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ ఇవ్వాల (శుక్రవారం) రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో పది రోజులుగా పెద్ద ఎత్తున బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకే జిల్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన డీఎస్పీలను, సొంత జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తూ ఈ మేరకు ఇవ్వాల డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement