Thursday, May 2, 2024

TS: కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ట‌చ్ చేసి చూడు… త‌డ‌ఖా చూపుతాం… పొన్నం ప్ర‌భాక‌ర్

క‌రీంన‌గ‌ర్ – రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ అందరికీ తెలుసని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహారాష్ట్రలో కూల్చిన విధంగా.. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడం కుదరదని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. క‌రీంన‌గ‌ర్ ఆద‌ర్శ‌న‌గ‌ర్ లో జరిగ‌న అగ్నిప్ర‌మాదం బాధితుల‌ను ఆయ‌న నేడు ప‌రామ‌ర్శించారు.. వారికి ధైర్యం చెప్పారు.. ప్ర‌భుత్వ ప‌రంగా సాయం అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు.

అనంత‌రం పొన్నం మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించారని, అయితే, ఆ నియామకాన్ని అందరూ ‘కిషన్‌ రెడ్డి.. నామినేటెడ్ బై కేసీఆర్’ అన్నారంటూ ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఏవో కుట్రలు చేయబోతున్నారని, అవన్నీ తమకు తెలుసని పేర్కొన్నారు. ఇన్నాళ్లు బీజేపీని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని జైలుకు పంపారని, అదే తెలంగాణ సంపదను ప్రాజెక్టుల పేరిట దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ పెద్దలు ఎందుకు జైలుకు పంపడం లేదంటూ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement