Wednesday, April 24, 2024

ఇవ్వాల‌ హనుమాన్‌ జయంతి.. కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

తెలంగాణ‌లో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు.. హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా ఇవ్వాల (బుధ‌వారం) అంజన్న ఆల‌యంలో భక్తుల రద్దీ నెలకొంది. నిన్న‌టి నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్‌ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు పెద్ద ఎత్తున‌ తరలివస్తుండటంతో కొండగట్టు కాషాయమయమయింది. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్‌.. జై హనుమాన్ నినాదాలు, నామస్మరణతో మారుమోగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement