Wednesday, May 1, 2024

Breaking: భూమి ఆక్రమించారని వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ.. న్యాయం చేయ‌కుంటే..

తమ భూమి ఆక్రమించారని ఓ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపింది. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని పాలితం గ్రామంలో శనివారం జ‌రిగింది. గ్రామానికి చెందిన సువర్ణ తమ భూమిని మరిది ఆక్రమించాడని, తమకు న్యాయం జరగడం లేదని నిర‌స‌న తెలిపింది. గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కింది. న్యాయం చేయకపోతే కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. గ్రామానికి చెందిన పలువురు సువర్ణను కిందికి దిగాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement