Tuesday, May 7, 2024

చెరువులో దూకి ఇద్ద‌రు బిడ్డ‌ల‌తో కుటుంబం మొత్తం ఆత్మ‌హ‌త్య‌.. అప్పులే కార‌ణ‌మా?

అప్పుల బాధ తాళలేక ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో జ‌రిగింది. మలక్‌పేట్​లో ఉంటున్న ఓ ముస్లిం దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ కుటుంబం కొంతకాలం నుంచి అప్పుల బాధతో ఇబ్బందులు ప‌డుతోంది. ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఆ కుటుంబం మొదట పురుగుల మందు తాగారు.

ఆ తరువాత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారేసరికి తండ్రి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు చెరువులో తేలాయి. మహిళ మృతదేహం కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తోంది. ఈ ఘటన ఆదిభట్ల పరిధిలోని కూర్మల్​గూడలో జరిగింది. మృతులను కుద్దూస్‌, ఫిర్దోస్‌, మెహక్‌ బేగంలుగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement