Saturday, July 27, 2024

TS | మెట్ పల్లీ మార్కెట్ యార్డులో భారీగా ప‌లికిన పసుపు ధర..

మెట్ పల్లీ, (ప్రభ న్యూస్) : మెట్ పల్లి పట్టణంలోని మార్కెట్ యార్డులో అత్యధికంగా 15000కుపైగా పసుపు ధ‌ర‌ పలికినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. అత్యధికంగా ఇబ్రహీంపట్నం మండలం కోమటి కొండాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు చిట్టవరపు వర్షిని పండించిన పసుపు క్వింటాలుకు రూ.15111 ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రానున్న రోజులో కూడా ఇదే ధర ఉండే విధంగా చూడాలని. దీంతో రైతులు లాభపడ‌తారని పలువురు రైతులు మాట్లాడారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement