Thursday, May 2, 2024

TS: 22 వ‌చ్చింది… జీతాలేవి… రేవంత్ ను ప్ర‌శ్నించిన హ‌రీష్ రావు

హైదరాబాద్‌: హామీలు తప్ప ఆచరణ మాత్రం కాంగ్రెస్‌కు సాధ్యం కావడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందని చెప్పారు. అయితే 22 రోజులు గడుస్తున్నా జీతం రాకపోవడంతో అంగన్‌వాడీలు అనేక తిప్పలు పడుతున్నారని తెలిపారు.

నెలంతా పనిచేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బందికి జీతాలు చెల్లించాలని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను తీర్చకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement