Wednesday, May 1, 2024

Thanks to People – సిరిసిల్ల ఎమ్మెల్యే అని చెప్పుకోడానికి గ‌ర్వంగాఉంది..కెటిఆర్

సిరిసిల్ల ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి గర్వపడతాన‌ని.. తనను ఇంతలా ఆదరించిన సిరిసిల్ల ప్రజల రుణాన్ని ఏమి ఇచ్చిన తీర్చుకోలేనని అన్నారు మంత్రి కెటిఆర్…ఎన్నిక‌ల ప్ర‌చారం చివరి రోజైన నేడు కెటిఆర్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షో నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, త‌నకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చింది సిరిసిల్ల ప్రజలేన‌ని.. మీరు గెలిపించకపోతే నాకంటూ ఓ గుర్తింపు ఉండేది కాదని అన్నారు.


అభివృద్ధిలో సిరిసిల్లను పరుగులు పెట్టించామని.. సిరిసిల్లకు చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. రాష్ట్రంలో మార్పు కావాలని కాంగ్రెస్ అంటోంద‌ని,.. ఆరునెలలకో వ్యక్తి సీఎం అయ్యే మార్పు కావాలా.. రైతు బంధు ఆగిపోయే మార్పు కావాలా అని ప్రశ్నించారు. లేక 3 గంటల కరెంట్ వచ్చే మార్పు కావాలా.. సిరిసిల్ల ఉరిసిల్ల అయ్యే మార్పు కావాలా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. సిరిసిల్లాను తాను చేసిన అభివృద్ధిని చూసి మ‌రోసారి ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement