Friday, May 17, 2024

Telangana – 31న కేబినెట్ భేటి …. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 3వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు జులై 31న మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్‌ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో వరదలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు సుమారు 50 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement